మెగాస్టార్ తొలి సినిమా దర్శకుడికి తీవ్ర అనారోగ్యం.. సహాయం కోసం ఎదురుచూపులు

Update: 2019-11-15 09:50 GMT
Punadirallu Movie Director

మెగాస్టార్ చిరంజీవి మొదటిసారిగా హీరోగా కెమరాను ఫేస్ చేసిన సినిమా పునాది రాళ్లు అయినప్పటికీ ప్రాణం ఖరీదు సినిమా మాత్రం మొదటి సినిమాగా విడుదలైంది. పునాది రాళ్లు సినిమాకి గూడపాటి రాజ్ కుమార్ దర్శకుడు.. ఈ సినిమాకి మొత్తం అయిదు నంది అవార్డులు లభించాయి.. జూన్ 21 ,1979లో విడుదలయ్యిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే చిత్ర దర్శకుడు మరియు నిర్మాత అయిన రాజ్ కుమార్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూన్నారు. గత కొద్ది రోజుల నుండి మంచానికే పరిమితమయ్యారు. అయన కొడుకు, భార్య ఇద్దరు చనిపోవడంతో ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఎవరైనా ఆర్ధిక సహాయం చేస్తారేమో అని చూస్తూ ఓ అద్దె ఇంట్లో జీవితాన్ని గడుపుతున్నాడు.


  

Tags:    

Similar News