సినీ నిర్మాణ రంగంలోకి మెగా డాటర్ ?

ఇప్పటికి మెగా ఫ్యామిలీలో మొత్తం ఎనమిది మంది హీరోలు ఉన్నారు.

Update: 2019-12-14 12:18 GMT
Chiranjeevi

ఇప్పటికి మెగా ఫ్యామిలీలో మొత్తం ఎనమిది మంది హీరోలు ఉన్నారు. లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇక మెగా డాటర్ గా నిహారిక ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మూడు సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు అంతా హిట్టు కాలేదు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లను చేసుకుంటుంది నిహారిక. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి మరో మెగా డాటర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె అయిన సుష్మిత త్వరలోనే సినిమాల్లోకి నిర్మాతగా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి ఖైది 150, సైరా నరసింహ రెడ్డి సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన సుస్మిత ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. మొదటగా వెబ్ సిరీస్ లకి గాను నిర్మాతగా వ్యవహరించి ఆ తర్వాత సినిమాలని చేయాలనీ అనుకుంటునట్టు తెలుస్తోంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు, ఇప్పటికే మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

Tags:    

Similar News