మంచు మనోజ్ సినిమాకి రామ్ చరణ్ క్లాప్

మూడేళ్ళ గ్యాప్ తర్వాత మంచు మనోజ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. 'అహం బ్రహ్మాస్మి' పేరుతో మనోజ్ ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2020-03-06 08:34 GMT
Manchu Manoj New movie

మూడేళ్ళ గ్యాప్ తర్వాత మంచు మనోజ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. 'అహం బ్రహ్మాస్మి' పేరుతో మనోజ్ ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఈ రోజు ఫిల్మ్ నగర్‌లోని దేవాలయంలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ వేడుకకి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అంతేకాకుండా మంచు మనోజ్ తల్లితండ్రులైన మోహన్ బాబు దంపతులు, మంచు లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక మంచు మనోజ్ మీదిగా రామ్ చరణ్ క్లాప్ ని ఇవ్వగా, మంచు లక్ష్మి, రామ్ చరణ్ అక్క సుస్మిత కెమెరాని స్విచ్ఛాన్ చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను మోహన్ బాబు ఆత్మీయ ఆలింగం చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'అహం బ్రహ్మాస్మి' సినిమాని మొత్తం అయిదు భాషలలో రిలీజ్ చేయనున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, తన తల్లి నిర్మల దేవితో కలిసి మనోజ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళం నటి ప్రియా భవాని శంకర్ ని ఫైనల్ చేసినట్టు సమాచారం..

మంచు మనోజ్ బాలనటుడుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. 'మేజర్ చంద్రకాంత్', 'అడవిలో అన్న', 'ఖదీగారు' సినిమాల్లో మనోజ్ బాలనటుడుగా నటించి మెప్పించాడు. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన 'శ్రీ' సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఆ తర్వాత చేసిన 'రాజూభాయ్', 'బిందాస్', 'వేదం', 'మిస్టర్ నూకయ్య', 'బిందాస్' వంటి సినిమాలు మనోజ్ కి మంచి పేరును తీసుకువచ్చాయి. మంచు మనోజ్ చివరగా ఒక్కడు మిగాలడు.. అనే సినిమాలో నటించాడు.  


Delete Edit


Tags:    

Similar News