దారుణంగా నిరాశపరిచిన మహేష్ "మహర్షి"

Update: 2019-10-18 16:09 GMT

రైతుపై మనం చూపించాల్సింది సింపథీకాదు, రెస్పెక్ట్ అంటూ వీకెండ్ వ్యవసాయంతో మహేష్ 25 వ సినిమా మహర్షి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాకి ముందుగా మామలు టాకే వచ్చినా మెల్లిమెల్లిగా మహర్షి రూ.100కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

ఇక అమెజాన్ ప్రైమ్ లో కూడా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ బుల్లితెరపై మాత్రం మహర్షి నిరాశపరిచిందనే చెప్పాలి. మహర్షి సినిమాకి బుల్లితెరపై 15 నుండీ 20 వరకూ టీఆర్పీ వస్తుందని అందరు అనుకున్నారు. కానీ కేవలం 8.4 రేటింగ్ మాత్రమే వచ్చింది. వాస్తవానికి బుల్లితెరపై మహేష్ కి మంచి రికార్డు ఉంది. థియేటర్స్‌లో ఫ్లాప్ అయిన అయన సినిమాలు నేనొక్కడినే, ఖలేజా లాంటి సినిమాలు బుల్లితెరపై బ్లాక్ బస్టర్ అయ్యాయి. మహర్షి విషయంలో అంచనాలకి మించి వస్తుంది అనుకుంటే 8.4 రేటింగ్ మాత్రమే రావడంతో మహేష్ ఫాన్స్ నిరాశకి గురయ్యారు.

ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మహేష్ కి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుంది. ఈ సినిమాతో అలనాటి తార విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరు ఉంది. 

Tags:    

Similar News