సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్
మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ , సాంగ్స్ సినిమాపైన భారీ అంచనాలను పెంచేసాయి. ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ సరికొత్త పద్ధతిని అవలంభిస్తుంది. ప్రతి సోమవారం సినిమాకి సంబంధించిన ఎదో ఒక అప్డేట్ ని ప్రేక్షకులకి అందిస్తూ సినిమాపైన హైప్స్ క్రియేట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే విడుదలైన రెండు పాటలకి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇక ప్రమోషన్లో భాగంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ వచ్చే ఏడాది జనవరి 5 న నిర్వహించనున్నారు. దీనికి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం వేదిక కానుంది. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ ముఖ్య అతిధిగా వస్తునట్టు తెలుస్తోంది. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో మహేష్ ఆర్మీ అజయ్ పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ కి జోడిగా రష్మిక మందన్న నటిస్తుంది. దిల్ రాజు, అనిల్ సుంకర తో కలిసి మహేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అలనాటి తార విజయశాంతి రీఎంట్రీ ఇస్తుంది. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ , సంగీత ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 11 న రిలీజ్ చేయనున్నారు.
And the countdown for the celebrations begin 🔥
— AK Entertainments (@AKentsOfficial) December 15, 2019
Grand PRE RELEASE FESTIVAL of #SarileruNeekevvaru will happen on 5th Jan at LB Stadium, Hyderabad 🥁
Super ⭐ @urstrulymahesh @anilravipudi @iamRashmika @thisisDSP @RathnaveluDop @AnilSunkara1 #MaSSMBFestivalOnJan11th pic.twitter.com/A51BJdxfG2