అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నికేవ్వరు. ఇందులో మహేష్ కి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుంది. ఈ సినిమాతో అలనాటి తార విజయశాంతి రీఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఆమెకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం.. అంతే కాకుండా మహేష్ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇందులో మహేష్ బ్లాక్ టీషర్టు వేసుకొని, స్టైలిష్ కళ్ళద్దాలు ధరించి బైక్ పై వెళ్తున్నట్టుగా చూపించారు. అయితే ఈ పోస్టర్ కి విశేషమైన స్పందన వస్తుంది. దాదాపు 69000మంది ఈ పోస్టర్ని లైక్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పోస్టర్కి ఇన్ని లైక్స్ రావడం ఇదే మొదటి సారి అని అంటున్నారు. ఇక సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.