టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు మహారాష్ట్రలోని షిర్టీ సాయిబాబాను దర్శించుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి షిర్డీ వెళ్లిన మహేశ్ బాబు అక్కడ బాబా ఆశీస్సులు తీసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు ప్రముఖ దర్శకుడు మెహర్ రమేశ్ కూడా ఉన్నారు.
ఇక మహేశ్ బాబు తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' అనే చిత్రంలో నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం =పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. విజయశాంతి కీలక పాత్రని పోషించారు. ఇప్పటికే తన పాత్రకు డబ్బింగ్ చెప్పేసిన మహేశ్ వారం రోజుల పాటు ఫ్యామిలీతో గడపాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఆయన షిర్డీ ఆలయానికి వెళ్లారు.
ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్ అదరగొట్టగా,సాంగ్స్ సినిమాపైన అంచనాలు పెంచాయి. ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా జనవరి 5న హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ–రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఈ సినిమాని 'దిల్' రాజు, అనిల్ సుంకర, మహేశ్బాబు నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.