సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ 'సరిలేరు నీకెవ్వరు' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేలా తెరకెక్కిన ఈ సినిమా తొలి మూడురోజుల్లోనే వందకోట్ల మార్క్ను దాటేసింది. బ్లాక్బస్టర్ కా బాప్గా బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తున్న ఈ సినిమా మూడు రోజుల్లో 103 కోట్ల రియల్ గ్రాస్ వసూలు చేసిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో చిత్రయూనిట్ రోజుకొక ప్రొమో, ప్రమోషన్ వీడియోలతో హల్చల్ చేస్తోంది. దీనిలో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలను డైరెక్టర్ అనిల్ రావిపూడి మహేశ్కు చదివి వినిపించాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికి మహేశ్ కూల్గా సమాధానమిచ్చాడు. ఇందులో చాలా ప్రశ్నలే ఉన్నాయి. అయితే అన్నింటిని పక్కనబెడితే మూవీలోని మైండ్ బ్లాంక్ పాటకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ విషయాన్ని హీరోనే స్పష్టం చేశాడు. తన కెరీర్ ఇంతలా డ్యాన్స్ గురించి మాట్లాడటం ఫస్ట్ టైమ్ వింటున్నానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ సినిమాలో మైండ్ బ్లాక్ సాంగ్లో శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ బాగా చేశారని, ఇక నుంచి ప్రతీ సినిమాకు అతడినే కొరియోగ్రఫర్గా పెట్టుకోవాలని మహేశ్ అభిమాని సజీషన్ సూచించాడు. తప్పకుండా తన చిత్రంలో కనీసం రెండు పాటలకు శేఖర్ మాస్టర్తో కలిసి పనిచేస్తామని మహేశ్ మాటిచ్చాడు. ఏది ఏమైనా శేఖర్ మాస్టర్కు ఇది బంఫర్ ఆఫరనే చెప్పాలి. పూర్తి విశేషాల కోసం కింది వీడియోను చూడండి.