మహేష్ తో వంశీ పైడిపల్లి మరో సినిమా
సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.. పక్కా మెసేజ్ తో, తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయాన్నే అందుకుంది. ఆ తర్వాత మహేష్ తో మహేష్ బాబు మరో సినిమా చేయనున్నారని టాక్ బలంగా వినిపించింది. కానీ దీనిపైన ఇటు మహేష్ కానీ అటు వంశీ కానీ ఎవరు స్పందించలేదు.
అయితే దీనిపైన తాజాగా వంశీ పైడిపల్లి స్పందించారు. మహేష్ బాబుతో మరో సినిమా చేయబోతునట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు వంశీ . ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నట్టుగా చెప్పుకొచ్చారు వంశీ. త్వరలో ఈ సినిమా పైన ఆఫీషల్ అనౌన్స్ మెంట్ రానుంది.
ఇక మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది.