సైరా సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి... సినిమాకి మంచి టాక్ వస్తుంది. దీనితో అయన నెక్స్ట్ సినిమా ఏంటి అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సైరా సినిమా తర్వాత కొరటాల శివతో సినిమా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే కథ చర్చలు కూడా ముగిసాయి. అయితే తాజాగా చిరంజీవి మలయాళంలో ఘన విజయం సాధించిన 'లూసిఫర్' సినిమా యొక్క రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని హీరో పృథ్విరాజ్ సుకుమారన్ అయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.
With #Chiranjeevi sir at the Kerala launch of #SyeraNarasimhaReddy What an absolute gem of a man! Humility and grace personified. I'm thrilled that you bought the rights to #Lucifer and will forever be sorry that I couldn't take up your offer to be part of #SNR sir! 🙏 pic.twitter.com/thGsUoRLAG
— Prithviraj Sukumaran (@PrithviOfficial) September 30, 2019
లూసిఫర్ అనే సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకుంది. మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా రూ.200 కోట్ల కలెక్షన్లును కొల్లగొట్టింది. ఈ సినిమాకి మురళీ గోపీ కథను అందించగా పృథ్విరాజ్ సుకుమారన్ తెరకెక్కించారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో 'ఎంపురాన్' పేరుతో దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాని చిరు ఎప్పుడు రీమేక్ చేస్తారన్న దానిపై మరింత ఆసక్తి నెలకొంది.