వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ముందుగా ప్రకటించినట్టుగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. నమ్మితేనే కదా ద్రోహం చేసేది అంటూ డైలాగ్తో ట్రైలర్ను ప్రారంభించిన ఆయన పలు అంశాలకు దృశ్య రూపం ఇచ్చారు. 3 నిమిషాల 11 సెకన్ల ఈ ట్రైలర్లో లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా వచ్చింది అనంతరం జరిగిన పరిణామాలను వివరించారు. వీటితో పాటు వైస్రాయ్ ఘటనలను రాంగోపాల్ వర్మ ప్రస్తావించారు. తన కడుపున పుట్టిన బిడ్డలను ఎన్టీఆర్ దండించే సీన్లు కూడా ఉన్నాయి. జీవితం ఎందుకు ఎలా మారుతుందో ఎవరికి తెలియదంటూ ట్రైలర్ను ముగించారు. చంద్రబాబు టార్గెట్గా ట్రైలర్ను విడుదల చేసినట్టు రాజకీయ, సినీ వర్గాలు భావిస్తున్నాయి.