కరోనా నియంత్రణకి లతా మంగేష్కర్‌ 25లక్షల విరాళం

Update: 2020-03-31 17:24 GMT
Lata Mangeshkar contributes Rs 25 lakh

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాల పోరాటానికి సినీ తారలు బాసటగా నిలుస్తున్నారు. పీఎం సహాయనిధితో పాటు రాష్ట్ర సీఎంల సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ రోజు (మంగళవారం) ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళం అందజేశారు.

లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సినీ కార్మికుల కోసం ముంబయి ఫిల్మ్‌ ఇండస్ట్రీ వర్కర్స్‌ యూనియన్‌కు దర్శకుడు రోహిత్‌శెట్టి 51 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఇక ఇప్పటికే పీఎం సహాయనిధికి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 25 కోట్ల రూపాయలను అందజేసిన విషయం తెలిసిందే..  

Tags:    

Similar News