డ్రంక్ డ్రైవ్ కేసులో టాలీవుడ్ హీరో ప్రిన్స్ సుశాంత్ కు కోర్టు శిక్ష విధించింది. గత నెల 24న డ్రంక్ అండ్ డ్రైవ్ లో సుశాంత్ పోలీసులకు పట్టుబడ్డాడు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో అతడికి 48 పాయింట్లు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సుశాంత్ కూకట్ పల్లి కోర్టుకు హాజరయ్యారు.
అతడికి న్యాయమూర్తి 5వేల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చారు. కాగా 'నీకు నాకు డ్యాష్ డ్యాష్' సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ప్రిన్స్.. 'బస్టాప్', 'నేను శైలజ', 'రొమాన్స్', 'మిస్టర్' వంటి చిత్రాల్లో కనిపించాడు. అలాగే 'బిగ్బాస్' మొదటి సీజన్లోనూ పాల్గొన్నాడు. ప్రస్తుతం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు ప్రిన్స్.