త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసిన 'అజ్ఞాతవాసి' పవన్ చివరి సినిమా.. ఈ సినిమా ఆశించినా ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలకు ఆపేసి పూర్తి స్థాయిలో రాజకీయాలపైన ఫోకస్ పెట్టారు. ఆ ఎన్నికల్లో అయన పార్టీ ఓడిపోయిన ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నారు. పవన్
ఇది ఇలా ఉంటే బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 'పింక్' అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అక్కడ అమితాబ్ బచ్చన్ చేసిన రోల్ ని ఇక్కడ పవన్ చేస్తున్నారు. బోని కపూర్ , దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో పవన్ లాయర్గా నటించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక పవన్ ఈ సినిమానే కాకుండా మరో సినిమాని చేసేందుకు ఫిక్స్ అయ్యారని టాక్ వినిపిస్తుంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమాని చేస్తున్నారని, ఓ పీరియాడిక్ డ్రామాగా సినిమా ఉండబోతుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి దీనిపైన క్రిష్ ఎం స్పందిస్తాడో లేదో చూడాలి మరి.. క్రిష్ చివరగా బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకత్వం వహించారు.