రోడ్డు ప్రమాదంలో స్టార్ దర్శకుడికి గాయాలు..

తమిళ దర్శకుడు సుశీంద్రన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.

Update: 2020-01-25 10:04 GMT

తమిళ దర్శకుడు సుశీంద్రన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అయన వాకింగ్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి వెనుకనుంచి వచ్చి బైక్ తో ఢీ కొట్టి వెళ్లిపోయాడు. వెంటనే ఆయనని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంలో ఆయనకి ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అయనకి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఇక సుశీంద్రన్ గొప్ప దర్శకుడు. విశాల్, కార్తి లాంటి దర్శకులతో సినిమాలను చేశారు. తాజాగా అయన 'కెనడీ క్లబ్, చాంపియన్ సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. దఅయన ర్శకత్వంలో తెరకెక్కిన నా పేరు శివ సినిమా తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ఇక అయనకి రోడ్డు ప్రమాదంలో గాయాలు అయ్యాయి అని తెలియడంతో కోలీవుడ్ దర్శకులు, నటీనటులు ఆయన్ని పరామర్శిస్తున్నారు.  

Tags:    

Similar News