దర్బార్ సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రజనీకాంత్.. ఈ సినిమాకి ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించారు. నయనతార హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కి విశేషమైన స్పందన వస్తుంది. ఇందులో రజినీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తర్వాత రజినీ శివ దర్శకత్వంలో ఓ సినిమాని చేయనున్నారు. ఇది రజినీకి 168వ చిత్రం. రజినీ పుట్టిన రోజు సందర్భంగా సినిమాని మొదలు పెట్టారు. ఇందులో ఖుష్బూ, మీనా చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఖుష్బూ, మీనాలు రజినీకి భార్యలుగా నటించనున్నారు. మరి ఇందులో కీర్తి పాత్ర ఏంటి అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో రజినీ చెల్లలుగా కీర్తి పాత్ర ఉండబోతుందని, ఆమె పాత్ర కీలకం కానుందని సమాచారం. వ్యవసాయంని హైలెట్ గా చేస్తూ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి డీ.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రకాశ్రాజ్, సూరి, శ్రీమాన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. చిత్రాన్ని 2020లో సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.