మొదలైన 'కార్తికేయ 2'
యంగ్ హీరో నిఖిల్ కెరీయర్ ని మలుపు తిప్పిన సినిమా కార్తికేయ.. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2014లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది.
యంగ్ హీరో నిఖిల్ కెరీయర్ ని మలుపు తిప్పిన సినిమా కార్తికేయ.. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2014లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ సరసన స్వాతి నటించింది. యానిమల్ హిప్నటిజం అనే కొత్త కాన్సెప్ట్ ని ఈ చిత్రం ద్వారా పరిచయం చేసిన దర్శకుడు మంచి హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ మొదలైంది. ఈరోజు (సోమవారం ) తిరుమలలో లాంఛనంగా ప్రారంభమైంది.
'దైవం మనుష్య రూపేణా' అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. సినిమాకి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక గత ఏడాది 'అర్జున్ సురవరం' సినిమాతో ఆకట్టుకున్న హీరో నిఖిల్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించకుండా సస్పెన్స్ లో పెట్టి ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కి స్టార్ట్ చేసి ఫ్యాన్స్ కి సప్రైజ్ ఇచ్చాడు. సినిమాని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయనున్నారు.
పల్లవి వర్మతో పెళ్లి :
పల్లవి వర్మతో పెళ్లి భీమవరం అమ్మాయి పల్లవి వర్మతో హీరో నిఖిల్ వివాహం త్వరలో జరగనుంది. ఇప్పటికే నిఖిల్ కి పల్లవికి గోవాలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఏప్రిల్ 16 న వీరికి హైదరాబాద్ లో వివాహం జరగనుంది.