ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా' మేహరీన్ కథానాయకగా నటిస్తుంది.

Update: 2019-12-20 08:16 GMT

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా' మేహరీన్ కథానాయకగా నటిస్తుంది. శతమానం భవతి ఫేం సతీష్ విగ్నేశ దర్శకత్వం వహిస్తున్నాడు. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని సంక్రాంతి పండగ కానుకగా జనవరి 15 న రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.

ఇక ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపైన భారీ అంచనాలను పెంచేసాయి. సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 5న లేదా జనవరి 6న జరపనున్నారని సమాచారం. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారని ప్రచారం సాగుతుంది. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, నరేష్‌, అన్నపూర్ణ, సుహాసిని కీలకపాత్రలలో నటించారు.

ఈ సినిమాని ఆదిత్య మ్యూజిక్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. 

Full View

Tags:    

Similar News