అతనొక్కడే, పటాస్ సినిమాల తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ కి చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవని చెప్పాలి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సతీష్ విగ్నేశ దర్శకత్వంలో ఎంత మంచివాడవురా అనే సినిమాని చేస్తున్నాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మేహరీన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని ఆదిత్య మ్యూజిక్ బ్యానర్పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త కలిసి నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు..
ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ఈ నెల 8న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనుంది. ఈ ఈవెంట్ కి కళ్యాణ్ రామ్ సోదరుడు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రానున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఈవెంట్ ని జేఆర్సీ కన్వెషన్ సెంటర్లో జరపనున్నారు. పక్కా ఫ్యామిలీ సినిమా కావడంతో సినిమాపైన మంచి అంచనాలను క్రియేట్ అయ్యాయి. దానికి తోడు ఈ సినిమా ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తుండడంతో మరింత క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి.
ఈ సినిమాని జనవరి 15 న విడుదల చేయనున్నారు. సంక్రాంతి బరిలో ఉన్న రజినీ- దర్బార్, అల్లు అర్జున్ - అల వైకుంఠపురములో, మహేష్ - సరిలేరు నీకేవ్వరు సినిమాలతో పోటి పడుతుంది ఈ సినిమా.. శతమానం భవతి లాంటి సినిమా తీసి జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సతీష్ విగ్నేశ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండడంతో ఎక్కువగా పాజిటివ్ బజ్ అయితే ఉంది.