నేడు ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్..చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఎంత మంచివాడవురా .. శతమానం భవతి ఫేం సతీష్ విగ్నేశ దర్శకత్వం వహించారు.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఎంత మంచివాడవురా .. శతమానం భవతి ఫేం సతీష్ విగ్నేశ దర్శకత్వం వహించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈ నెల 15 న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ , టీజర్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఇక సినిమా విడుదల తేది దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరును పెంచేసింది. అందులో భాగంగానే చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ రోజు ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకని హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకి నందమూరి కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రానున్నారు. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకి నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో రానున్నారు.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్గా నటించింది. వి.కె.నరేశ్, సుహాసిని, శరత్బాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అతనొక్కడే, పటాస్ సినిమాల తర్వాత సరైనా హిట్టు లేని కళ్యాణ్ రామ్ ఈ సినిమాపైన భారీ ఆశలు పెట్టుకున్నాడు. శతమానం భవతి లాంటి సినిమా తీసి జాతీయ అవార్డును అందుకున్న సతీష్ విగ్నేశ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుండడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ సంక్రాంతికి ఈ సినిమానే కాకుండా రజినీకాంత్ - దర్బార్ , మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ - అల వైకుంఠపురములో సినిమాలు విడుదలవుతున్నాయి. అన్ని భారీ సినిమాల మధ్యలో కూడా కళ్యాణ్ రామ్ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడంటే సినిమాపైన చిత్ర యూనిట్ ఎంత నమ్మకంగా ఉందొ అర్ధం అవుతుంది. చూడాలి మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో..నేడు ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్ .. చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్.