జయంత్ సి పరాన్జీ తండ్రి కన్నుమూత

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు దర్శకుడు జయంత్ సి పరాన్జీ.

Update: 2020-01-07 07:19 GMT

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు దర్శకుడు జయంత్ సి పరాన్జీ.. ప్రీతీ జింటా , ఐశ్వర్య రాయ్, సోనాలీ బింద్రే, లీసా రాయ్, అంజలా జవేరీ, మరియు బిపాషా బసు వంటి బాలీవుడ్ తారలను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన దర్శకుడు కూడా ఈయనే కావడం విశేషం.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్, నాగార్జునలతో సినిమాలు చేశాడు జయంత్ ...

ఇక ఇది ఇలా ఉంటే అయన తండ్రి చంద్రమౌళి (92) కన్నుమూసారు. గత కొద్దిరోజులుగా వయోభారంతో బాధ పడుతున్న అయన ఈ రోజు తన స్వగ్రామంలో మరణించారు. చిత్తూరు జిల్లాలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన చంద్రమౌళి స్వయంకృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆయన వైద్యుల జాతీయ సంస్థకు రెండు పర్యాయాలు అఖిల భారత అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.

ఈ విషయం తెలుసుకున్న సినీ పరిశ్రమలోని పలువురు ఆయనకి నివాళులు అర్పిస్తూ అయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. చంద్రమౌళికి భార్య,ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో పెద్ద అయిన జయంత్ సినిమా రంగం వైపు వచ్చారు.  

Tags:    

Similar News