మొక్కు చెల్లించుకున్న జబర్దస్త్ బ్యూటీ
జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలా మంది హాస్యనటులు వెండితెరకి పరిచయం అవుతున్నారు. తమ టాలెంట్ ని బుల్లితెరపైన చూపించుకొని వెండితెర అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలా మంది హాస్యనటులు వెండితెరకి పరిచయం అవుతున్నారు. తమ టాలెంట్ ని బుల్లితెరపైన చూపించుకొని వెండితెర అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. మరికొందరు షోని వదిలేసి సినిమాల్లోనే సెటిల్ అయిపోయారు. ఇంకొందరు మాత్రం జబర్దస్త్లో మెరిసినా ఆ తర్వాత కనిపించకుండా పోయారు. వారిలో ఒకరు సాయితేజ అలియాస్ పింకీ.
ఒకప్పుడు జబర్దస్త్లో లేడి గెటప్ లో కనిపించి చాలా స్కిట్స్ చేశాడు సాయితేజ. ప్రస్తుతం జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నాడు. ఈ షోలో లేడి గెటప్ లు వేసి ఏకంగా అమ్మాయిగానే మారిపోయాడు. జెండర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించుకొని, యువతిగా మారి తన పేరును ప్రియాంక సింగ్గా మార్చుకున్నాడు. ఇప్పుడు జబర్దస్త్ లో కనిపించకపోయిన టిక్ టాక్లో మాత్రం చాలా యాక్టివ్గానే ఉంటుంది. ప్రస్తుతం జీ తెలుగులో గుండమ్మ కథ సీరియల్లో నటిస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా సాయి పింకీ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించింది. మోకాళ్లపైనే కొండపైకి ఎక్కి తన మొక్కు చెల్లించుకుంది. మెట్ల దారి మధ్యలో మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ పెట్టుకుంటూ అనంతరం అమ్మవారిని దర్శించుకుంది. అవకాశాల కోసమే అమ్మవారిని దర్శించుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తానూ అమ్మాయిగా మారడానికి గల విషయాలను ప్రియాంక సింగ్ ఇప్పటికే పేర్కొంది. నాకు చిన్నప్పటి నుంచే నాలో అమ్మాయిల లక్షణాలు ఉండేవని, ఐదేళ్ల వయస్సులో నా అక్క దుస్తులు వేసుకునేవాడినని,అయితే, మా ఊర్లో మా నాన్న పరువు పోతుందనే ఉద్దేశంతో ఈ విషయం నా కుటుంబ సభ్యులకు చెప్పలేదని, జబర్దస్త్లో అమ్మాయిగా గెటప్ వేస్తున్నప్పుడు చాలా సంతోషం కలిగేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ప్రియాంక సింగ్.