రేటు పెంచేసిన ఇస్మార్ట్ భామ... ఐటెం సాంగ్ కోసం భారీ డిమాండ్...!
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అయింది నిధి అగర్వాల్.
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అయింది నిధి అగర్వాల్.. మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అందం, అభినయంతో ఆకట్టుకుంది నిధి..ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేసిన అది కూడా ప్లాప్ అయింది. ఇక గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ హిట్ కావడంతో ఈ భామకి మంచి క్రేజ్ వచ్చేసింది. దీనితో వరుస సినిమాలకి సైన్ చేసి బిజీ అయిపోతుంది.
అందులో భాగంగానే భూమి అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకి పరిచయం కాబోతుంది నిధి. ఇందులో జయం రవి హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.ఇక మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి గాను నిధి అగర్వాల్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాకి శమంతకమణి ఫేం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక సినిమాలతోపాటు నిధి అగర్వాల్కి స్పెషల్ సాంగ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయట. తాజాగా ఓ సినిమా లోని ఐటెం సాంగ్ కోసం కోసం నిధిని సంప్రదించగా, ఆమె 60 లక్షలు డిమాండ్ చేసినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను నిధి పక్కగా ఫాలో అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందని తెలుస్తుంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాని దీపావళి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కి 27 వ చిత్రం కావడం విశేషం.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.