జీ సినీ అవార్డ్స్లో ఆదరగోట్టిన ఇస్మార్ట్ శంకర్
గత ఏడాది వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.
గత ఏడాది వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.. విడుదలైన అన్ని చోట్లల్లో ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది. హీరో రామ్ బాడీ లాంగ్వేజ్, పూరి డైలాగ్స్ సినిమాని విజయం వైపు నడిపించాయి. ఈ సినిమాలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ నటించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాధ్, చార్మీలు ఈ సినిమాను నిర్మించారు. జూలై 18,2019న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమా తాజాగా జీ సినీ అవార్డ్స్ ప్రకటించిన జీ సినీ అవార్డ్స్లో సత్తా చాటింది. పూరీ జగన్నాథ్ బెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్గా, రామ్ బెస్ట్ సెన్సేషనల్ హీరోగా, ఛార్మి బెస్ట్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్గా, బెస్ట్ సెన్సేషనల్ మూవీగా ఇస్మార్ట్ శంకర్,బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా మణిశర్మలు ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి అవార్డులు పొందారు.
ఈ చిత్రానికి ఇన్ని అవార్డ్స్ రావడంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ తీస్తానని పూరి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమాని చేస్తున్నాడు . ఈ సినిమాని స్రవంతి కిషోర్ నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నారు.