త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న కీర్తి సురేష్!
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది..
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రను పోషించి అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకి గాను జాతీయ అవార్డును సొంతం చేసుకుంది కీర్తి సురేష్.. ఇక తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాలో మెరిసింది..
అయితే తాజాగా త్వరలో ఆమె పెళ్లి పీటలు ఎక్కనుందని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుంది... కీర్తి సురేష్ కోసం ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటికే ఓ వరుడిని వెతికారని ,అతను ప్రముఖ బీజేపీ నాయకుడి కుమారుడని సమాచారం. ఈ ఏడాది చివరలో వారిద్దరి వివాహం జరగనున్నట్టు నటుడు ఫూల్వాన్ రంగనాథన్ ఒక మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అయితే దీని పైన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో కీర్తీ సురేష్ పెళ్లి చేసుకోవడం ఏమిటనే ప్రశ్నలు ప్రస్తుతం మీడియాలో వస్తున్నాయి.
ప్రస్తుతం తెలుగు తమిళ చిత్రాలతో కీర్తి సురేష్ బిజీగా ఉంది.. తెలుగులో హీరో నితిన్ నటిస్తున్న రంగ్ దే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.. తాజాగా దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ నీ చిత్ర యూనిట్ విడుదల చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాతో పాటు మిస్ ఇండియా అనే తెలుగు చిత్రంలో కీర్తి నటిస్తుంది. ఇక తమిళంలో అన్నాత్తి, పెంగ్విన్ చిత్రాలలో నటిస్తుంది.