ఆస్కార్ అవార్డుల్లో భారతీయ డాక్యు మెంటరీ చరిత్ర సృష్టించింది. పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే ఇండియన్ డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ లభించింది. లాస్ఏంజెల్స్లో జరిగిన ఆస్కార్ వేడుకలో మన డాక్యుమెంటరీ చిత్రానికి అవార్డు గెలుచుకుంది. ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా నిర్మించిన పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్..లో రుతుక్రమ సమస్యల గురించి చక్కగా చూపించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రేకా జెహ్తాబ్చి ఆస్కార్ అవార్డు అందుకున్నారు.