వైష్ణవ్ తేజ్ తొలి సినిమాకే భారీ స్థాయి బిజినెస్ ..

మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకి పరిచయం అవుతున్నాడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.. వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీకి కొత్తేమికాదు.. చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీయస్ సినిమాలో కీలకపాత్ర పోషించాడు.

Update: 2020-03-07 11:26 GMT
Uppena

మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకి పరిచయం అవుతున్నాడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.. వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీకి కొత్తేమికాదు.. చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీయస్ సినిమాలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు ఉప్పెన సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది..

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన నిత్యా శెట్టి అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సాంగ్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేశాయి. ప్రస్తుతం శేరావేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దాదాపుగా ఈ చిత్రాన్ని 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం.. కేవలం కథని నమ్మి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోందట.. అయితే ఈ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు 4 కోట్లు పెట్టి కొన్నట్టుగా తెలుస్తోంది. సినిమాలపై మంచి జడ్జిమెంట్ ఉన్న దిల్ రాజు ఈ సినిమాని ఇంత ఖర్చు పెట్టి కొనడంతో సినిమాపైన మరిన్ని అంచనాలు పెరిగాయి.

నైజాంలో మంచి రేటుతో అమ్ముడుపోవడంతో మిగతా ఏరియాల నుంచి కూడా మంచి ఆఫర్లే వస్తాయని తెలుస్తోంది. ఇక థియేట్రికల్ బిజినెస్ రూ.15 కోట్ల దాకా అయ్యేలా ఉంది. ఇక డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా కలిపితే పెట్టిన బడ్జెట్ రికవరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. చూడాలి మరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో  

Tags:    

Similar News