సినిమా సక్సెస్: హ్యాపీ హగ్స్!
ఈ సంక్రాంతికి విడుదలైన భారీ చిత్రాలలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
ఈ సంక్రాంతికి విడుదలైన భారీ చిత్రాలలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మంచి టాక్ సంపాదించుకొని దూసుకుపోతున్నాయి. మొదటిగా విడుదల విషయంలో పోటి పడ్డా ఈ రెండు చిత్రాలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా పోటిపడుతున్నాయి. సరిలేరు నీకెవ్వరు ఏడూ రోజుల్లో వంద కోట్ల మార్క్ ని అందుకుందని, అల వైకుంఠపురములో ఆరు రోజుల్లో వంద కోట్ల మార్క్ ని అందుకున్నట్టుగా చిత్ర నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.
సినిమాలో మంచి సక్సెస్ కావడంతో సరిలేరు నీకెవ్వరు టీం వరంగల్ లో అభిమానుల సమక్షంలో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయగా, అల వైకుంఠపురములో టీం వైజాగ్ లో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసి సినిమా సక్సెస్ కావడానికి కారణం అయిన ప్రేక్షకులకి ధన్యవాదలు తెలిపారు. ఇక హీరోలు మరింత హ్యాపీగా ఫీల్ అవుతూ తమ కెరీర్ కి బెస్ట్ చిత్రాలను అందించిన దర్శకులను ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. పక్కా కమర్షియల్ బ్యాక్ గ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.
What journey we had ... desire in our heart ... fear in our bones ... conviction in our mind ... open to our ears ... clear in our head ... work in our hands ... energy in our body ... dare in our chest ... focus in our eyes ... instincts in our gut ...true in our thought ... pic.twitter.com/trzfC4Dxv8
— Allu Arjun (@alluarjun) January 19, 2020