డైరెక్టర్ గా మారిన హీరోయిన్ కళ్యాణి
తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళ దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో విజయనిర్మల, బి జయ, జీవిత రాజశేఖర్, సుధ కొంగర
తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళ దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో విజయనిర్మల, బి జయ, జీవిత రాజశేఖర్, సుధ కొంగరలాంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకా మహిళదర్శకులు చిత్ర పరిశ్రమకి రావాలని సినీ ఇండస్ట్రీ కూడా కోరుకుంటుంది. అయితే ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన కళ్యాణి ఇప్పుడు దర్శకురాలుగా మారుతుంది. చేతన్ శీను హీరోగా కళ్యాణి ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకత్వ భాద్యతలు మాత్రమే కాదు కే2కే ప్రొడక్షన్స్ బ్యానర్పై ఓ చిత్రాన్ని కళ్యాణినే రూపొందిస్తున్నారు.
ఈ రోజు హోలీ కావడంతో సినిమాకి సంబంధించిన ప్రీ లుక్, టీజర్ గ్లింప్స్ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సినిమా మంచి విజయం సాధించాలని బెస్ట్ విషెస్ ని కూడా అందించారు. ఈ సినిమాలో సిద్ధి, సుహాసిసి మణిరత్నం, రోహిత్ మురళి, శ్వేత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ్ బాషలలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఓ విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకేక్కుతుందని సమాచారం..
రాజశేఖర్ హీరోగా నటించిన 'శేషు' సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది కళ్యాణి.. ఆ తర్వాత వంశీ దర్శకత్వంలో వచ్చిన 'ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' సినిమాలో నటించి మంచి గుర్తింపును అందుకున్నారు. ఈ సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా వరించింది. ఇక వెంకటేష్తో వసంతం, పెదబాబు, పందెం, శ్రావణమాసం మొదలగు సినిమాలో నటించారు. హీరోయిన్గానే కాకుండా వదినగా, తల్లిగా కూడా నటించారు కళ్యాణి. తెలుగులో చివరిగా 'యాత్ర' సినిమాలో కళ్యాణి నటించారు.
Best wishes #KaveriKalyani for your directorial debut. Here is the PreLook & #TeaserGlimpse of @K2KProduction Prod No.1 https://t.co/SIL6hBxsoh
— PURIJAGAN (@purijagan) March 9, 2020
All the best @ChethanCheenu, #Shweta & team. #K2KProductions #ChethanCheenu@UrsVamsiShekar #HappyHoli pic.twitter.com/7QotRUZkTu