విజయ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ... ధియేటర్ ద్వంసం

Update: 2019-10-25 09:57 GMT

తమిళ్ హీరో విజయ్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేసారు. అయన కథానాయకుడుగా దర్శకడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బిగిల్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో విజయ్ కి జోడిగా నయనతార నటించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ షో వేయలేదని ఫాన్స్ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. చెన్నైలోని క్రిష్ణగిరిలోని ఓ ధియేటర్ ని ఏకాంగా ద్వంసం చేసారు.

అంతేకాకుండా పక్కకి ఉన్న దుకాణాలకి కూడా నిప్పు అంటించారు. స్పెషల్ షో కి పరిమిషన్ ఇచ్చేందుకు తమిళ్ ప్రభుత్వం ఆలస్యం చేసింది. నిన్న ( గురవారం ) సాయింత్రం ఎట్టకేలకు పరిమిషన్ ఇచ్చినప్పటికీ ధియేటర్ లో స్పెషల్ షో వేయకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో రెచ్చిపోయారు. దీనిపైన సమాచారం అందుకున్న పోలీసులు ధియేటర్ వద్దకి చేరుకొని లాఠీ చార్జ్ చేసారు. దీనికి కారుకులైన 37 మందిని అరెస్ట్ చేసారు. 

Tags:    

Similar News