ఆగిపోయిన వెంకీ 'నారప్ప'.. కారణం ఇదే!
గత ఏడాది ఎఫ్2, వెంకీమామ సినిమాలతో అలరించిన హీరో వెంకటేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో "నారప్ప" అనే సినిమాని చేస్తున్నాడు.
గత ఏడాది ఎఫ్2, వెంకీమామ సినిమాలతో అలరించిన హీరో వెంకటేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో "నారప్ప" అనే సినిమాని చేస్తున్నాడు. ధనుష్ హీరోగా తమిళ్ లో తెరకెక్కిన 'అసురన్'కు రీమేక్గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడెక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రం చిత్తూరు, అనంతపురంలలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. అందులో భాగంగా సినిమాలో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారట! ఇక వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరగడంతో 'నారప్ప' సినిమా షూటింగ్ను కొంతకాలంపాటు వాయిదా వేశారు. ఈ విషయాన్ని సురేష్ ప్రొడెక్షన్స్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. " కొవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా 'నారప్ప' సినిమాని కొంతకాలంపాటు బ్రేక్ ఇస్తున్నాం. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మళ్లీ షూట్ను తిరిగి ప్రారంభిస్తాం. వీలైనంత వరకూ జన సమూహాలకు దూరంగా ఉండాలని కోరుతున్నాం. ఆరోగ్యంగా, జాగ్రత్తగా ఉండండి" అని సురేష్ ప్రొడక్షన్ పేర్కొంది. చిత్తూరు, అనంతపురంలలో ఫస్ట్ షెడ్యూల్ను పూర్తి చేసుకొని చిత్ర యూనిట్ హైదరాబాద్ కి వచ్చేసింది. అయితే ఇప్పటివరకు చేసిన షూటింగ్ పార్ట్ కి డబ్బింగ్ పూర్తి అయిందని తెలుస్తోంది.
రెండు పాత్రల్లో నారప్ప :
ఈ సినిమాలో వెంకీ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అయితే యంగ్ గెటప్ లో వెంకీగా హీరో రానా కనిపించనున్నాడని తెలుస్తోంది.ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సినిమాని వేసవిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్ చిత్రం అసురన్ సినిమాకి రీమేక్ కావడం, దానిని వెంకటేష్ లాంటి సీనియర్ నటుడు చేయడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.