అల .... డబ్బింగ్ మొదలైంది..!

Update: 2019-11-11 11:07 GMT
ala vaikunthapuramulo

అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో.. పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి పండగకు గాను ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే అప్పుడే చిత్ర యూనిట్ డబ్బింగ్ కూడా మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న హీరో సుశాంత్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న పిక్ ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.



ఇందులో సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఈ పాత్ర తన కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని సుశాంత్ భావిస్తున్నాడు. నవదీప్, రావు రమేష్ , మురళీ శర్మ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు. ఇక అలనాటి తార టబు ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. బన్ని, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది మూడవ చిత్రం కాబట్టి సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. 

Tags:    

Similar News