సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 42 లో బైక్పై ఓవర్ స్పీడ్ గా వెళ్తున్న వ్యక్తికి ఎదురుగా కారు అడ్డు రావడంతో బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో బైక్ కింద పడిపోగా బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్ ఆ వ్యక్తిని చేరదీశాడు. గాయపడ్డ వ్యక్తిని తానే స్వయంగా ఎత్తుకున్న సాయి ధరమ్ తేజ్ కారులో ఎక్కించాడు. అక్కడి నుంచి అతడిని తన కారులోనే ఆస్పత్రికి తరలించారు. అయితే విషయం ఆరా తీస్తే గాయపడ్డ వ్యక్తి సాయి ధరమ్ తేజ్ స్నేహితుడే అని తెలిసింది. ముందుగా మరో బైక్ లో సాయి ధరమ్ తేజ్ వెళ్లగా ఆ వెనకే తన ఫ్రెండ్ బైక్ పై వస్తున్నాడు. అనూహ్యంగా కారు అడ్డు రావడంతో బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో తేజ్ ఫ్రెండ్ కు గాయాలయ్యాయి.