బాబాయ్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తి : రామ్ చరణ్ 70 లక్షల విరాళం..

కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు.

Update: 2020-03-26 06:37 GMT
Pawan Kalyan and ram charan (File photo)

కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు. ఇక ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ రూ. 2 కోట్లు, టాలీవుడ్ హీరో నితిన్ ఏపీ, తెలంగాణకు రూ.10 లక్షల రూపాలయ చొప్పున విరాళాలును అందజేశారు. తాజాగా హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి 50 లక్షల రూపాయల చొప్పున కోటి రూపాయలను, ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. కోటి రూపాయలను అందజేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాని , రెండు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రుల సహాయనిధికి డెబ్బై లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.. తాను చేయూత ఇయ్యటానికి తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు స్ఫూర్తి అని, ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని రామ్ చరణ్ ట్వీటర్ వేదికగా తెలియజేశాడు.. ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాలకి 20 లక్షల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించారు.. త్వరలో ముఖ్యమంత్రి సహాయనిధికి చెక్కును అందజేస్తున్నట్లు వెల్లడించారు..

ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది. ప్రపంచంలో ఇప్పటికే 20 వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక భారత్లో 630 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..

Tags:    

Similar News