అభిమానికి అవార్డుని అంకితం చేసిన రామ్ చరణ్

Update: 2019-12-10 14:25 GMT
Ram Charan ( File photo)

"మీరు లేకపోతే మేము లేము.. మీరే మాకు అన్ని.. మీకు ఎప్పటికి రుణపడి ఉంటాం" అని ఇలా వచ్చిన వేడుకల్లో ప్రతి ఒక్క హీరో చెప్పే మాటలే ఇవి.. కానీ ఇందులో ఎంత మంది హీరోలు తమ అభిమానుల కోసం తమకి తోచింది చేస్తున్నారంటే చాలా తక్కువే అని చెప్పాలి. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు..

మెగా హీరోలకి వీరాభిమానిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి నూర్ భాయ్. అయన గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆయన వారికీ అభిమాని మాత్రమే కాదు ఆప్తుడు కూడా.. తాజాగా నూర్ భాయ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న మెగా హీరోలంతా నూర్ భాయ్ ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అయన కుటుంబానికి ప్రగాడ సంతాపాన్ని తెలిపారు.

అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ అభిమాని ఇక లేదు అన్న ఈ విషయాన్ని తెలుసుకొని చాలా భాదపడ్డారు. ఈ నేపధ్యంలో అయన కుటుంబానికి పది లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా తాజాగా ఆ దివంగత అభిమానికి తనకి వచ్చిన అవార్డుని అంకితమిచ్చారు. తమిళనాడుకు చెందిన ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ 'బిహైండ్ వుడ్స్' ఏటా సినిమా వాళ్లకు అవార్డులు ఇస్తుంది.

అందులో భాగంగా రామ్ చరణ్‌ ఈ ఏడాదికి గాను ''ది పీపుల్స్ ఎంటర్‌టైనర్ పార్ ఎక్స్‌లెన్స్ - తెలుగు'' కేటగిరీలో గోల్డ్ మెడల్ ని అందుకున్నాడు. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ తన మెడల్‌ను అభిమాని నూర్ భాయ్‌కి అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ చేసిన ఈ పనికి మెగా ఫ్యాన్స్ అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  


Tags:    

Similar News