తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని

Update: 2019-09-08 05:52 GMT

టాలీవుడ్ హీరో నాని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శకుడు విక్రమ్ కుమార్ తో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు నానికి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందచేశారు. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేయించారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు హీరో నాని. సెప్టెంబర్ 13వ తేదీన విడుదల కానున్న గ్యాంగ్ లీడర్ సినిమా విజయవంతం కావాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News