అప్పుడు విలన్ గా ... ఇప్పుడు హీరోగా?

ఇప్పుడు గోపీచంద్ చేస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఎన్నో అంచనాలు పెట్టుకొని చేసిన చాణిక్య సినిమా

Update: 2019-12-02 15:54 GMT
Gopichand

తోలివలుపు సినిమాతో హీరోగా తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయ్యాడు హీరో గోపీచంద్.. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో హీరోగా అవకాశాలు తగ్గాయి.. ఈ నేపధ్యంలో తేజ దర్శకత్వం వహించిన జయం సినిమాలో విలన్ గా చేశాడు గోపీచంద్.. ఆ సినిమా హిట్టు కావడం, గోపీచంద్ నటనకి మంచి మార్కులు పడడంతో వరుసగా విలన్ గా అవకాశాలు వచ్చాయి..

ఇక మళ్ళీ యజ్ఞం సినిమాతో హీరోగా నిలదొక్కుకున్నాడు గోపీచంద్.. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మళ్ళీ వెనుకకి తిరిగి చూసుకుంది లేదు.. రణం, లక్ష్యం, లౌక్యం లాంటి సినిమాలు మంచి హిట్టు అయ్యాయి.. కానీ ఇప్పుడు గోపీచంద్ చేస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఎన్నో అంచనాలు పెట్టుకొని చేసిన చాణిక్య సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

ఇక చేయబోయే సినిమా కోసం ఆచితూచి కథలు వింటున్నాడు గోపీచంద్.. అయితే తనని విలన్ గా పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో హీరోగా చేసేందుకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.. ఓ విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకేక్కుతుందని తెలుస్తుంది. ఈ సినిమా త్వరలో పట్టాలేక్కనుందని సమాచారం. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. 

Tags:    

Similar News