కరోనా వైరస్ పై పోరాటానికి ప్రభుత్వానికి పలువురు అండగా నిలుస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు వారికి తమ వంతు సాయం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా కారణంగా పనులు లేకుండా పోయిన పేదలకు హీరో గోపీచంద్ తన వంతు సాయం అందించారు. దాదాపు వెయ్యికి పైగా కుటుంబాలకు ఒకనెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేసారు. ఆయనే స్వయంగా వీటిని పేదలకు అందించారు. కరోనాపై పోరాటంలో తనకు తోచిన విధంగా పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.