మహేష్ పాటపై రష్మిక టిక్ టాక్‌ వీడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' .. రష్మిక మందన్నా హీరోయిన్

Update: 2019-12-13 14:52 GMT
Rashmika Mandanna

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' .. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. చిత్రీకరణ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ కూడా సరికొత్తగా ప్రమోషన్స్ ని మొదలు పెట్టింది.

అందులో భాగంగానే ప్రతి సోమవారం సినిమాకి సంబంధించిన ఎదో ఒక అప్డేట్ ని రిలీజ్ చేస్తూనే వస్తుంది. ఇప్పటికే రెండు సాంగ్స్ ని బయటకు వదిలింది. ఇప్పుడు మరో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. 'హి ఈజ్ సో క్యూట్' అంటూ సాంగే పాటను కాస్తా వెరైటీగా రిలీజ్ చేశారు. ఆ పాటకు హీరోయిన్ రష్మిక మందన్న డాన్స్ చేస్తున్న వీడియోను టిక్ టాక్‌లో విడుదల చేశారు.

ఈ పాటకు గాను రష్మిక అద్దిరిపోయే స్టెప్పులేసింది. ఈ పాటకి సంబంధించిన ఫుల్ సాంగ్ ని డిసెంబరు 16 సాయంత్రం 05.04 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక రష్మిక చేసిన డ్యాన్స్‌కు మహేష్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు. ఇందులో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించబోతున్నాడు..

ఈ సినిమాని మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో అలనాటి హీరోయిన్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, సంగీత ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

Full View

Tags:    

Similar News