దర్శకుడు హరీష్ శంకర్, హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం గద్దలకొండ గణేష్.. పూజా హేగ్దే హీరోయిన్ గా నటించింది. సినిమాకి మంచి టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది . ఈ సినిమాకి మిక్కి.జే.మేయర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.. అయితే ముందుగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ తో సంగీతం చేయించాలని అనుకున్నారట. కానీ సినిమాలో "ఎల్లువొచ్చి గోదారమ్మ" సాంగ్ ని రీమేక్ చేయాలనీ అడగడంతో అయన సున్నితంగా తిరస్కరించరట...
అయితే హరీష్ కి ఈ విషయం ముందే తెలుసట.. కానీ దేవిని ఒప్పించ్చవచ్చు అని అనుకున్నారట ... కానీ దీనిని దేవి సున్నితంగా తిరస్కరించి మరో సినిమాకి పనిచేద్దామని అన్నారట.. ఈ విషయాన్నీ హరీష్ శంకర్ తాజాగా వెల్లడించారు. ఇందులో నాదే తప్పని ఇప్పటికి మేము మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చాడు హరీష్ .. అయితే హరీష్ మాట్లాడిన ఈ వీడియోపై ట్విట్టర్ లో దేవి స్పందించారు. నా గురించి గొప్పగా మాట్లాడవు.. దీనిపై క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు.. నీ నిజయతికి హాట్స్ ఆఫ్.. త్వరలో నీతో కలిసి సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నానని అని దేవి ట్వీట్ చేసాడు. దేవి ట్వీట్ ని హరీష్ రీట్వీట్ చేస్తూ మీరు చాలా గొప్ప కంపోజర్ మాత్రమే కాదు . గొప్ప వ్యక్తి కూడా అని హరీష్ ట్వీట్ చేసాడు.
Sir Ji as I always say ... apart from a great composer you are a great human being which is also very inspiring for me .... love you sir Ji ..... 🤗🤗🤗🤗🤗 https://t.co/bRrhs0qHM1
— Harish Shankar .S (@harish2you) October 14, 2019