గల్లా జయదేవ్ కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నూతన చిత్రం ప్రారంభం అయింది.. రామానాయుడు స్టూడియోలో చాలా మంది అతిధిల మధ్య ఈ సినిమాని ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిధిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు. రామ్ చరణ్ క్లాప్ కొట్టి అల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, గల్లా జయదేవ్, నరేష్, దగ్గుపాటి రానా, సుదీర్ బాబ తదితరులు హాజరయ్యారు. ఇందులో ఇస్మార్ట్ శంకర్ బ్యూటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా పద్మావతి గల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందించనున్నారు. ఇక ట్విట్టర్ ద్వారా మహేష్ చిత్ర యూనిట్ కి అల్ ది బెస్ట్ చెప్పారు.
It's official !! @AshokGalla_'s first day of shoot !! Want to wish u all the very best on this big day of yours!! Work hard and give it all u've got! Success will follow 🤗🤗 good luck to the entire team...👍👍👍 pic.twitter.com/xKtP9TJz0f
— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2019