ఎప్పటికైనా వ్యవసాయం చేస్తా: రేణూ దేశాయ్
నటుడు పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న అనంతరం తన పిల్లలతో కలిసి పూణేలో ఉంటుంది నటి రేణూ దేశాయ్.
నటుడు పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న అనంతరం తన పిల్లలతో కలిసి పూణేలో ఉంటుంది నటి రేణూ దేశాయ్.. ఇప్పటికే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె నిర్మాతగా, దర్శకురాలుగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇవే కాకుండా తనలో మరో కోణం ఉంది అంటుంది రేణూ దేశాయ్.. తాజాగా ఓ షూటింగ్ నేపధ్యంలో వికారాబాద్ వెళ్లిన ఆమె అక్కడ గ్రామాలలో తిరిగారు, పిల్లలతో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్ట్రా గ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె పల్లె జీవితాన్ని తాను కోల్పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు పల్లెటూరి వాతావరణాన్ని దగ్గరగా చూసిన ఆమె తానూ భవిష్యత్తులో తన పిల్లలు కాలేజీలో చేరిన తర్వాత వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా వెల్లడించారు. ఓ మారుమూల గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ, ఓ పది పిల్లులు, 10 కుక్కలు, ఇతరత్రా మూగజీవాలు, లెక్కలేనన్ని పుస్తకాలు, ఇవి ఉంటే చాలు తనకు స్వర్గంలో ఉన్నట్టే ఉంటుందని, త్వరలోనే ఇది నెరవేరాలని కోరుకుంటున్నానని ఆమె పోస్ట్ పెట్టారు.