'మైండ్ బ్లాక్' చేయనున్న మహేష్
రేపే మొదటి సోమవారం కావడంతో సినిమా నుండి తొలి పాటని విడుదల చేయనున్నారు. ‘మైండ్ బ్లాక్’ అంటూ సాగే
సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' .. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమాకి చిత్ర యూనిట్ కొత్తగా ప్రమోషన్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే... అందులో భాగంగా ఐదు సోమవారాల్లో ఐదు పాటలు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.
అయితే రేపే మొదటి సోమవారం కావడంతో సినిమా నుండి తొలి పాటని విడుదల చేయనున్నారు. 'మైండ్ బ్లాక్' అంటూ సాగే ఈ మాస్ సాంగ్ను విడుదల చేస్తున్నారు. ఈ పాట లిరికల్ వీడియోను రేపు సాయంత్రం 5.04 గంటలకు యూట్యూబ్లో విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.
ఇప్పటికే విడుదల చేసిన చిత్ర టిజర్ ప్రేక్షకులను వీపతితంగా ఆకట్టుకుంటుంది. దీనితో సినిమాపైన భారీ అంచనాల ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ అజయ్ గా కనిపించనున్నాడు. ఇందులో మహేష్ కి జోడిగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను దిల్రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమాని విడుదల చేస్తున్నారు.
Ok Guys..Releasin d MASS SONG 1st..as U all wanted so..❤️
— DEVI SRI PRASAD (@ThisIsDSP) December 1, 2019
Its called #MBSONG coz it is #MindBlock
Now all in ur hands 2 love it n live it..frm 2moro 5:04PM ❤️
Super⭐️@urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @iamRashmika @RathnaveluDop @AKentsOfficial @SVC_official @GMBents pic.twitter.com/4KMULllN1D