Republic Day విషెస్ చెప్పిన స్టార్స్

Update: 2020-01-26 06:12 GMT

71వ గణతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వీధివీధిన మువన్నెల జెండాలు ఎగరవేస్తూ స్వీట్లు పంచుకొని ఆనందిస్తున్నారు. ఈ నేపధ్యంలో సినీ తారలు తమ అభిమానులకి గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

మహేష్ బాబు :

ఓ ఛానల్ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సైన్యంతో మాట్లాడారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. "ఇది ధైర్య సైనికులందరికీ గౌరవ సమావేశం. ఇది నిస్సందేహంగా నా మరపురాని రోజులలో ఒకటి! రోజూ మమ్మల్ని రక్షించడం కొనసాగిస్తున్న దేశ వీరులకు భారీ వందనం" అంటూ మహేష్ పేర్కొన్నారు. తాజాగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో సైనుకుడి పాత్రలో నటించారు మహేష్ బాబు.

వరలక్ష్మి శరత్ కుమార్ :

తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ అభిమానులకి గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా "ఈ సంవత్సరం మనం జరగబోయే మార్పును చూస్తానని ఆశిస్తున్నాను..మరియు మన దేశం ఎప్పటిలాగే ఏకీకృతమై జాతీ, మత, వర్గ విభేదాలు లేని దేశంగా ఎదగాలి. మనం 2020 లో ఉన్నాము, మనం ముందుకు సాగుదాం వెనుకకు కాదు అంటూ ట్వీట్ చేశారు.

మంచు మనోజ్ :

ఎప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే హీరో మంచు మనోజ్ తన అభిమానులకి గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా "రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును ఎంతో ఆదరిద్దాం మరియు సంబరాలు చేసుకుందాం మరియు స్వాతంత్ర్య సమరయోధులందరికీ నివాళి అర్పిద్దాం" అంటూ ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News