పునాదిరాళ్లు దర్శకుడికి అందిన సహాయం..
నటుడు, మనం సైతం కాదంబరి కిరణ్ కుమార్ 25 వేల నగదును అందజేశారు. మనం కుటుంబం నుండి సహాయం చేద్దామని అందరిని అడగగా
మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా పునాదిరాళ్ళు. ఆ సినిమా దర్శకుడు రాజ్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో భాదపడుతూ ఆర్ధిక సహాయం కోస్తూ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ వార్తను తెలుసుకున్న కొందరు అయనకి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగా ప్రసాద్స్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్ట్నర్ సురేష్రెడ్డి తార్నాకలో ఉన్న దర్శకుడు రాజ్ కుమార్ దగ్గరకు వెళ్లి రూ.41వేలు అందజేశారు.
అంతేకాకుండా సినిమా పరిశ్రమ నుండి నటుడు, మనం సైతం కాదంబరి కిరణ్ కుమార్ 25 వేల నగదును అందజేశారు. మనం కుటుంబం నుండి సహాయం చేద్దామని అందరిని అడగగా అందరు స్పందించి కొంత నగదు ఇచ్చారు. ఆలా అందినా మొత్తాన్ని కలిపి కాదంబరి కిరణ్ స్వయంగా వెళ్లి రాజ్కుమార్కు ఇచ్చారు. తనకి సహాయం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రాజ్ కుమార్.. దర్శకుడు రాజ్ కుమార్ తీసిన సినిమాలు కొన్ని మాత్రమే అయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. పునాదిరాళ్ళు సినిమాకి గాను మొత్తం అయిదు నంది అవార్డులు రావడం విశేషం..