మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ?

Update: 2019-11-11 09:21 GMT
SS Thaman, DSP

ఈ సంక్రాంతికి చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇందులో మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలపైన ఎక్కువగా పోటి నడవనుంది. ఇద్దరు స్టార్ హీరోలు కావడంతో సంక్రాంతికి పెద్ద వార్ నడవబోతుంది అన్న విషయం అర్ధం అయిపోతుంది. ఇక అల వైకుంఠపురములో సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదల అయి శ్రోతలను వీపరితంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సామజవరగమనా పాట అత్యధికమంది లైక్ కొట్టిన తొలి తెలుగు పాటగా రికార్డు సృష్టించింది.

ఇక ఇది ఇలా ఉంటే మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఒక్క పాట కూడా విడుదల కాలేదు. దీనితో అటు మహేష్ ఫ్యాన్స్, ఇటు దేవి ఫ్యాన్స్ సినిమా నుండి వెంటనే సాంగ్స్ ను బయటకు వదలాలని కోరుతున్నారు. ఇక చిత్ర బృందం కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దేవి ఈ సినిమాకి అదిరిపోయే పాటలను అందించాడని సినిమా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు ఆ సాంగ్స్ అల వైకుంఠపురములో సాంగ్స్ ని బ్రేక్ చేస్తాయా అన్నది చూడాలి. 

Tags:    

Similar News