మనిషి బతకడానికి మొక్కలు ఎంతో అవసరం : వి.వి. వినాయక్‌

Update: 2020-02-15 10:46 GMT
మనిషి బతకడానికి మొక్కలు ఎంతో అవసరం : వి.వి. వినాయక్‌

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌ను డైరెక్టర్ వీవీ వినాయక్ స్వీకరించారు. జూబ్లీహిల్స్‌లోని తన ఆఫీస్‌లో మొక్కలు నాటారు. మనిషి బతకడానికి మొక్కలు ఎంతో అవసరమన్నారు డైరెక్టర్ వీవీ వినాయక్. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా చేస్తున్నారని కొనియాడారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న సంతోష్‌ కుమార్‌కు వినాయక్‌ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హీరో బెల్లంకొడ సాయి శ్రీనివాస్, సినీ నిర్మాతలు నల్లమల బుజ్జి, మల్లిడి సత్యనారాయణ రెడ్డికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు వివీ వినాయక్. 

Tags:    

Similar News