10 మంది హీరోయిన్లతో 'భార్యదేవోభవ'

Update: 2019-11-24 16:15 GMT
srinivas reddy

అదిరిందయ్యా చంద్రం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి.. ఆ తర్వాత అన్ని హాస్యప్రధానమైన చిత్రాలను చేసుకుంటూ వచ్చారు. ఇక అక్కినేని నాగార్జునతో చేసిన ఢమరుకం సినిమాకి గాను ఆయనకి మంచి పేరు వచ్చింది. దీనితో అయనని ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి అని పిలవడం మొదలు పెట్టారు. తాజాగా అయన కామెడీ జోనర్ ని వదిలేసి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రాగల 24 గంటల్లో అనే సినిమాని తీశారు. సత్యదేవ్ , ఈశా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది.

సినిమాకి మంచి టాక్ రావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఇందులో దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తానూ చేయబోయే తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి భార్యదేవోభ‌వ‌ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశానని, ఇందులో ప్రముఖ హీరో న‌టించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప‌ది మంది హీరోయిన్స్ ఇందులో న‌టించ‌నున్నట్లు తెలిపారు. సినిమా మొత్తం హాస్యప్రధానంగా సాగుతుందని పేర్కొన్నారు. సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను త్వర‌లో తెలియ‌చేస్తానని చెప్పారు.  

Tags:    

Similar News