రాఘవేంద్రరావు తెలుగు సినిమా దర్శకుల్లో ఆయనోదో ప్రత్యేకమైన శైలి.. అయన పాటలు ఇప్పటికి ప్రేక్షకుల మదిలో అలా ఉండిపోతాయి. దాదాపుగా వందకి పైగా సినిమాలకి దర్శకత్వం వహించారు అయన.. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఎన్టీఆర్ తో చేసిన అడివిరాముడు సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మారధం పట్టారు. అప్పటివరకు ఎన్టీఆర్ సినిమాలకి పూలు వేయడం, హారతులు ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ అడవిరాముడు సినిమాకి మాత్రం డబ్బులను వేయడం మొదలు పెట్టారని చెప్పుకొచ్చారు ఆయన.. ఆ తర్వాత వేటగాడు,జగదీకవీరుడు అతిలోక సుందరి సినిమాలకి కూడా ఇలాగే జరిగిందని అయన చెప్పుకొచ్చారు.