కోరనా ఎఫెక్ట్ : పూరి ఆఫీస్ కి తాళం
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన ఆచార్య చిత్రాన్ని వాయిదా వేస్తునట్టుగా వెల్లడించాడు. ఇప్పుడు ఆ లిస్టు లోకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా చేరిపోయాడు
కరోనా... ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతకమైన వ్యాధి.. ఈ వైరస్ భారీనా పడి చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయాయి. మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు జాగ్రత్తలను తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చాయి. అంతేకాకుండా సినిమా ధియేటర్స్, షాపింగ్ మాల్స్ పబ్బులను ఈ నెల చివరివరకు మూసివేశాయి. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ప్రభుత్వ ఆదేశాలకి అనుగుణంగా షూటింగ్ లను అపివేస్తునట్టు నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన ఆచార్య చిత్రాన్ని వాయిదా వేస్తునట్టుగా వెల్లడించాడు. ఇప్పుడు ఆ లిస్టు లోకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా చేరిపోయాడు.. కరోనా నుంచి తన ఆఫీస్ స్టాఫ్ను కాపాడుకునేందుకు పీసీ బ్యానర్లో అడ్మినిస్ట్రేషన్, ప్రొడక్షన్ వర్క్స్ను తాత్కాలికంగా క్లోజ్ చేస్తున్నట్టుగా పూరి వెల్లడించాడు. కరోనాపై యుద్ధంలో గెలవాలంటే సమిష్టిగా పోరాడదామని పూరి పేర్కొన్నాడు. అంతేకాకుండా కరోనాపై ప్రభుత్వం వెల్లడించిన నియమాలని కచ్చితంగా పాటించాలని పూరి పేర్కొన్నాడు. దీనిని చార్మీ తన ట్విట్టర్ ఎకౌంటులో షేర్ చేసింది.
ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాని తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కరణ్ జోహార్, ఛార్మీ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ముంబైలో 40 రోజుల భారీ షెడ్యూల్ పూర్తిచేసిన టీమ్ హైదరాబాదులో మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావం వలన సినిమాని కొన్ని రోజులు నిలిపివేసింది.
Winning this battle is in our collective effort .
— Charmme Kaur (@Charmmeofficial) March 17, 2020
.
. @purijagan
@PuriConnects #CoronavirusOutbreak pic.twitter.com/AOaaQEO1RF